ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగురాళ్లలో పట్టపగలు భారీ చోరీ

ABN, First Publish Date - 2021-10-22T05:26:03+05:30

పట్టణంలోని జానపాడురోడ్డుకు చెందిన దుర్గాఫార్మసీ యజమాని ఆతుకూరి పూర్ణచంద్రరావు ఇంట్లో గురువారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది.

దుండగులు పగలగొట్టిన బీరువా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.26 లక్షల బంగారు, వెండి నగల అపహరణ 

పిడుగురాళ్ల, అక్టోబరు 21: పట్టణంలోని జానపాడురోడ్డుకు చెందిన దుర్గాఫార్మసీ యజమాని ఆతుకూరి పూర్ణచంద్రరావు ఇంట్లో గురువారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మామగారిని చూసేందుకు పూర్ణచంద్రరావు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లారు. గమనించిన దొంగలు తాళాలు తొలగించి ఇంట్లోకి ప్రవేశించి  బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 25 సవర్ల బంగారం, 15 కేజీల వెండిని అపహరించుకుపోయారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు గుంటూరులోని పూర్ణచంద్రరావుకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సమీర్‌బాష సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.  


Updated Date - 2021-10-22T05:26:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising