ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీకి యువతను మరింత దగ్గర చేస్తాం

ABN, First Publish Date - 2021-07-24T05:43:19+05:30

తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ మరింత బలోపేతానికి కృషి చేస్తమని గుంటూరు పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులు రావిపాటి సాయికృష్ణ, షేక్‌ నాగుల్‌మీరా అన్నారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న టీడీపీ నేతలు నసీర్‌ అహ్మద్‌, సాయి, నాగుల్‌మీరా తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు యువత నేతలు

గుంటూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ మరింత బలోపేతానికి కృషి చేస్తమని గుంటూరు పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్ష, కార్యదర్శులు రావిపాటి సాయికృష్ణ, షేక్‌ నాగుల్‌మీరా అన్నారు. తెలుగు యువత పదవులు ప్రకటించిన సందర్భంగా సాయిమిత్ర మండలి ఆధ్వర్యంలో తొలుత గుంటూరు రింగురోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తూర్పు నియోజకవర్గంలోని ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద పార్టీ ఇన్‌చార్జ్‌ మహ్మద్‌ నసీర్‌, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యల్లావుల అశోక్‌, సభ్యుల నేతృత్వరంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నసీర్‌ మాట్లాడుతూ యువతను మరింతగా పార్టీకి దగ్గర చేయాలని తెలుగు యువత నేతలు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్‌ నేత ఆరాధ్యుల రమణరావు, నేతలు హఫీజ్‌, బత్తిని  వెంకటేశ్వరరావు, జగన్మోహనరావు, మానుకొండ బ్రహ్మాజీ, నన్నపనేని అవినాష్‌, పంచుమర్తి శేషు, ఎం.గోపి, వంశీలతో పాటు యువత, విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

   

Updated Date - 2021-07-24T05:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising