ఉరివేసుకుని బాలుడి మృతి
ABN, First Publish Date - 2021-05-16T05:58:10+05:30
గత సంవత్సరం మరణించినతండ్రి జ్ఞాపకాలనుంచి బయటకు రాలేని కుమారుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది
తెనాలి రూరల్, మే 15: గత సంవత్సరం మరణించినతండ్రి జ్ఞాపకాలనుంచి బయటకు రాలేని కుమారుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్ ఎస్ఐ ప్రసన్నకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నందివెలుగు గ్రామానికి చెందిన తిన్నలూరు బార్గవసత్యనారాయణ (14) తండ్రి గత సంవత్సరం మరణించాడు. తండ్రి మరణించినప్పటి నుంచి బార్గవ మనోవేదనకు లోనయ్యాడు. ఉన్నట్లుండి శుక్రవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తలుపు పగులగొట్టి బాధితుడిన తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అన్న రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రసన్నకుమార్ తెలిపారు.
Updated Date - 2021-05-16T05:58:10+05:30 IST