రోడ్డుప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి
ABN, First Publish Date - 2021-11-29T05:27:52+05:30
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని రెడ్డిగూడెం లోలెవల్ చప్టా వద్ద ఆదివారం చోటుచేసుకుంది
రాజుపాలెం, నవంబరు28: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలోని రెడ్డిగూడెం లోలెవల్ చప్టా వద్ద ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.. బెల్లంకొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీచర్ పనిచేస్తున్న కట్టా జ్ఞానమ్మ(35) బెల్లంకొండ అడ్డరోడ్డులో నివాసం ఉంటోంది. వ్యక్తిగత పనుల నిమిత్తం సత్తెనపల్లి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో ఎక్కింది. మార్గమధ్యలో పిడుగురాళ్ల నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీ అతివేగంతో వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో జ్ఞానమ్మకు తీవ్ర గాయాలుకాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అమీర్ తెలిపారు.
Updated Date - 2021-11-29T05:27:52+05:30 IST