ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం చేతగానితనంతోనే కొవిడ్ మరణాలు : టీడీపీ నేత

ABN, First Publish Date - 2021-06-16T18:25:01+05:30

కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ విమర్శించారు. బుధవారం కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదన్నారు. ఆక్సిజన్ అందక 70 మంది చనిపోయారని... ప్రభుత్వం చేతగానితనంతోనే మరణాలు జరిగాయని ఆరోపించారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు పదిలక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలన్నారు. మౌళిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రోడ్ మ్యాప్‌తో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదని టీడీపీ నేత నసీర్ అహ్మద్ అన్నారు.

Updated Date - 2021-06-16T18:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising