ఓటీఎస్ ఎవ్వరూ కట్టవద్దు: Kovelamudi
ABN, First Publish Date - 2021-12-20T17:48:58+05:30
ఓటీఎస్ ఎవ్వరూ కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా గృహ హక్కు కల్పిస్తామని టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర అన్నారు.
గుంటూరు: ఓటీఎస్ ఎవ్వరూ కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా గృహ హక్కు కల్పిస్తామని ఆ పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుటకోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. తక్షణమే ఓటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పరిపాలన చేతగాని సీఎం తక్షణమే రాజీనామా చేయాలని కోవెలమూడి రవీంద్ర డిమాండ్ చేశారు.
Updated Date - 2021-12-20T17:48:58+05:30 IST