ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదా సాధించాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-06-20T19:18:34+05:30

ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. 25 మంది వైసీపీ ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని సీఎం జగన్‌ చెప్పారని, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడేళ్లలో ఏపీకి ప్రధాని మోదీ ద్రోహం చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. జగన్‌ ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని రామకృష్ణ కోరారు. 


ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని... పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని... వైసీపీకి 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరా చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారు. లోక్‌సభలో ఎన్డీయేకు పూర్తి మెజారిటీ ఉన్నందున హోదాపై కేంద్రాన్ని అభ్యర్థించడం మినహా ఏం చేయలేమని చేతులెత్తేశారు.

Updated Date - 2021-06-20T19:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising