యూపీ ఘటనపై విచారణ జరిపించాలి
ABN, First Publish Date - 2021-10-17T06:07:48+05:30
యూపీలో రైతులపై నుంచి కేంద్ర మంత్రి తనయుడు కారు పోనించిన ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావులు డిమాండ్ చేశారు.
గుంటూరు, అక్టోబరు 16: యూపీలో రైతులపై నుంచి కేంద్ర మంత్రి తనయుడు కారు పోనించిన ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావులు డిమాండ్ చేశారు. యూపీ ఘటనతో పాటు రైతులకు గిట్టుబాటు ధరను చట్టంలో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీ ఘటనపై కేంద్ర మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2021-10-17T06:07:48+05:30 IST