ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంగంలో ముగిసిన ఏసీబీ సోదాలు

ABN, First Publish Date - 2021-05-17T06:00:21+05:30

మండలంలోని వడ్లమూడి సంగం డెయిరీలో జరుగుతున్న ఏసీబీ సోదాలు ఆదివారంతో ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత నెల 23 నుంచి కొనసాగిన తనిఖీలు


చేబ్రోలు, మే 16: మండలంలోని వడ్లమూడి సంగం డెయిరీలో జరుగుతున్న ఏసీబీ సోదాలు ఆదివారంతో ముగిశాయి. గత నెల 23న డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఎండీ గోపాలకృష్ణన్లపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాల కోసం అప్పటి నుంచి ఏసీబీ అధికారులు డెయిరీలోని పరిపాలనా భవనాన్ని స్వాధీనం చేసుకుని సోదాలు చేపట్టారు.  సెలవు దినాలలో సైతం ఉద్యోగులను కార్యాలయానికి పిలిపించి సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం పరిపాలనా భవనాన్ని ఏరోజుకారోజు సీజ్‌ చేసేశారు. ఏసీబీ అధికారులు పరిపాలనా భవనాన్ని సీజ్‌ చేయడం వల్ల, రోజుల తరబడి సోదాల వల్ల డెయిరీ కార్యకలాపాలు కుంటుబడుతున్నాయని ఉద్యోగులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీంతో సోదాలను 16వ తేదీలోగా ముగించి 17న ఆ వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారంతో డెయిరీలో సోదాలు ముగించినట్లు సమాచారం. ఆదివారం సోదాల అనంతరం పంచనామా నిర్వహించి పరిపాలన భవనాన్ని సంగం అధికారులకు అప్పగించినట్లు సమాచారం.  

Updated Date - 2021-05-17T06:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising