సమయపాలన పాటించాలి
ABN, First Publish Date - 2021-10-29T05:24:54+05:30
సర్వీసుల రాకపోకల్లో ఇకపై ఖచ్ఛితమైన సమయపాలన పాటించాలని రీజనల్ మేనేజర్ విజయగీత తెలిపారు.
ఆర్టీసీ ఆర్ఎం విజయగీత
గుంటూరు, అక్టోబరు 28: సర్వీసుల రాకపోకల్లో ఇకపై ఖచ్ఛితమైన సమయపాలన పాటించాలని రీజనల్ మేనేజర్ విజయగీత తెలిపారు. ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆమె గురువారం గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లోని తిక్కన సమావేశ మందిరంలో 13 డిపోల మేనేజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీజియన్లో అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా ఆయా రూట్లలో బస్సుల ఫ్రీక్వెన్సీని, ఆదాయాన్ని పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల నుంచి ఎటువంటి ఫిర్యాదు లేని రవాణా సౌకర్యాన్ని అందించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎంఈ శరతబాబు, డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, ఏటీఎం శ్రీనివాసరెడ్డి, కమర్షియల్ ఏటీఎం కేడీఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:24:54+05:30 IST