తెనాలి రామలింగేశ్వరపేట శివాలయంలో చోరీ
ABN, First Publish Date - 2021-06-20T20:14:38+05:30
తెనాలి రామలింగేశ్వరపేట శివాలయంలో చోరీ జరిగింది.
గుంటూరు జిల్లా: తెనాలి రామలింగేశ్వరపేట శివాలయంలో చోరీ జరిగింది. హుండీని దుండగుడు ధ్వంసం చేసి నగదును ఎత్తుకుపోయాడు. నిందితుడి కదలికలు సీసీ కెమారాలో రికార్డు అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఆలయం నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు అప్రమత్తమై కేకలు వేశారు. దీంతో నిందితుడు గుడి ప్రధాన ద్వారం పక్కనే ఉన్న గోడదూకి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-06-20T20:14:38+05:30 IST