ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని ప్రాంతంలో యువతిపై సామూహిక అత్యాచారం

ABN, First Publish Date - 2021-06-20T19:02:31+05:30

రాజధాని ప్రాంతంతో ఘోరం జరిగింది. సీతానగరం పుష్కర ఘాట్‌లో నిన్న రాత్రి ప్రేమజంటపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: రాజధాని ప్రాంతంతో ఘోరం జరిగింది. సీతానగరం పుష్కర ఘాట్‌లో రాత్రి ప్రేమజంటపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. కృష్ణానది తీరం ఇసుకలో కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. యువతి ప్రియుడిని దుండగులు తాళ్లతో కట్టేశారు. పుష్కరఘాట్‌లోనే యువతిపై అత్యాచారానికి ఇద్దరు యువకులు పాల్పడ్డారు. దుండగులు పడవలో విజయవాడ వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రోజు తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసింది. యువతిని చికిత్స కోసం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 


కాబోయే భర్తతో కలిసి పుష్కర ఘాట్‌కు వెళ్ళిందని బాధితురాలి తల్లి చెబుతోంది. తాడేపల్లి బ్లేడ్ బ్యాచ్ జంటపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె వాపోయింది. బాధితురాలు ఫోన్ చేసి చెప్పటంతోనే నది వద్దకు వెళ్లామని ఆమె తెలిపింది. పోలీసులు నిందితుల కోసం నదిలో మూడు గంటల సేపు గాలించారని తెలిపింది. తన కూతురు మాట్లాడలేని స్థితిలో ఉందని తల్లి పేర్కొంది. వీరిద్దరికి కొద్ది రోజుల్లో పెళ్లి చేయాలని నిర్ణయించామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-20T19:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising