ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిని నిర్వీర్యం చేస్తే అనర్థమే

ABN, First Publish Date - 2021-11-28T05:29:58+05:30

రాజధాని అమరావతిని నిరీర్వం చేస్తే అనర్థమే అని రైతులు పేర్కొన్నారు.

తుళ్లూరు రైతు ధర్నా శిబిరాలలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 711వ రోజు దీక్ష శిబిరాల్లో రైతులు 


తుళ్లూరు, నవంబరు 27: రాజధాని అమరావతిని నిరీర్వం చేస్తే అనర్థమే అని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 711వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతిని నాశనం చేయాలనే ఒకే ఒక్క సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. అమరావతినే ఐదుకోట్ల మంది కోరుకుంటున్నారు అనడానికి ఇదే నిదర్శనమన్నారు. మూడు రాజధానుల బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని తెలిసి కూడా మరలా పెడతామనడం విచారకరమని పేర్కొన్నారు. ఇంకా మొండిగా ముందుకు వెళతామని అనుకుంటే, ప్రజలు తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని రైతులు పేర్కొన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.  దీపాలు వెలిగించి  జై అమరావతి అంటూ నినాదాలు చేశారు .

Updated Date - 2021-11-28T05:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising