ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోరు

ABN, First Publish Date - 2021-10-27T05:18:07+05:30

రాజధాని అమరావతిపై అసత్య ప్రచారాలు చేసిన, ఉద్యమం చేస్తున్న వారి గురించి అసభ్యకరంగా మాట్లాడిన వారిపైన ఫిర్యాదులు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రాజధాని రైతులు తెలిపారు.

మందడం శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

679వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, అక్టోబరు 26: రాజధాని అమరావతిపై అసత్య ప్రచారాలు చేసిన, ఉద్యమం చేస్తున్న వారి గురించి అసభ్యకరంగా మాట్లాడిన వారిపైన ఫిర్యాదులు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, మహిళలు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 679వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి ముంపు ప్రాంతం, నిర్మాణాలకు అనుకూలంగా ఉండదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలపై చర్యలు లేవని, మహిళలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. రాజధానికి భూములు ఇచ్చి కూడా పాలకుల వల్ల పడుతున్న బాధలను ప్రపంచానికి చెప్పుకుందామంటే గొంతు నొక్కి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు అయోమయంలో పడిపోయారన్నారు. నవంబరు ఒకటి నుంచి అమరావతి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని న్యాయస్థానం టూ దేవస్థానం వరకు చేపట్టే మహా పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 

 

Updated Date - 2021-10-27T05:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising