ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణల తొలగింపుపై బాధితుల ఆగ్రమం

ABN, First Publish Date - 2021-12-08T05:23:09+05:30

అన్యాయంగా తమ ఇళ్లను కూలగొడుతున్నారంటూ పెదవడ్లపూడిలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

పెదవడ్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంగళగిరి, డిసెంబరు 7: అన్యాయంగా తమ ఇళ్లను కూలగొడుతున్నారంటూ పెదవడ్లపూడిలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా మంగళగిరి నగరపాలకసంస్థలో విలీనమైన పెదవడ్లపూడిలో రోడ్ల వెంబడివున్న ఆక్రమిత నివాసాలను మంగళవారం జేసీబీలతో అధికారులు తొలగింపజేశారు. గ్రామంలోని శివాలయం సెంటరుతోపాటు స్టేషన్‌రోడ్డు, పరిసర వీధుల్లోని ఆక్రమణలను కూల్చివేశారు. దీంతో బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు మంగళవారం రాత్రి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం.. ఇప్పుడొచ్చి ఆక్రమణలని చెబుతున్నారు... ఆక్రమణలైతే మాకు వేరేచోట స్థలాలిచ్చి ఇళ్లు కట్టించి మమ్మల్ని ఖాళీ చేయించాలి అని అన్నారు. టీడీపీ నాయకులు జవ్వాది కిరణ్‌చంద్‌, మాదల రమేష్‌ తదితరులు నిరసనకు మద్దతుగా పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising