ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పమిడిపాడు బ్రాంచ కెనాల్‌కు గండి

ABN, First Publish Date - 2021-12-26T05:53:55+05:30

ప్రధాన సాగునీటి కాలువైన పమడిపాడు బ్రాంచ కెనాల్‌కు శనివారం గండి పడింది. దీంతో కాలువ నీరంతా పంట పొలాల్లోకి ప్రవహించింది.

పీబీసీకి గండి పడిన ప్రదేశం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిలిచిన సాగునీటి సరఫరా 

నూజెండ్ల, డిసెంబరు 25: ప్రధాన సాగునీటి కాలువైన పమడిపాడు బ్రాంచ కెనాల్‌కు శనివారం గండి పడింది. దీంతో కాలువ నీరంతా పంట పొలాల్లోకి ప్రవహించింది. పమిడిపాడు బ్రాంచ కెనాల్‌ 10వ మైలు ఈటీ శిధిలావస్ధకు చేరడంతో లీకేజీ ఏర్పడింది. అధికారులు సరైన సమయంలో మరమ్మతులు చేయించకపోవడంతో ఈటీ దెబ్బతిని కాలువ కట్ట కోతకుగురై కొట్టుకుపోయింది. కాలువలో ప్రవహిస్తున్న 350క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా యూటీ, వాగులు, పంట పొలాలపై నీరు ప్రవహించింది. విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా ముండ్లమూరు సబ్‌డివిజన డీఈఈ వెంకట సతీష్‌ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి, బయ్యారం హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద నీటి సరఫరాను నిలిపి వేయించారు. నీటి ప్రవాహం వెంటనేఆదివారం  నుండి యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి పంటపొలాలకు సాగు నీరు అందించేందుకుచర్యలు చేపడతామని డీఈఈ తెలిపారు. పీబీసీకి గండిపడిన విషయం తెలుసుకున్నరైతులు ఆందోళనకు దిగారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. 


Updated Date - 2021-12-26T05:53:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising