ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-07T05:49:27+05:30

కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో గురువారం జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాదెండ్ల, మే 6: కరోనాతో భర్త మృతిని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గణపవరం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం బొల్లాపల్లి మండలం రేమిడిచర్లకు చెందిన కలవల వెంకటేశ్వర్లు(53) గణపవరంలో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వర్లుకు కరోనా సోకడంతో నరసరావుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 1వ తేదీన మృతి చెందాడు. భార్యతోపాటు పిల్లలకు  కరోనా సోకడంతో వివిధ ఆసుపత్రులలో చికిత్సకు చేరారు. భార్య భాగ్యలక్ష్మి(46)కి నెగిటివ్‌ రావడంతో బుధవారం ఇంటికి వచ్చింది. భర్త మరణం సమాచారం తెలుసుకున్న ఆమె జీర్ణించుకోలేక ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలిద్దరూ  చిలకలూరిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.  

Updated Date - 2021-05-07T05:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising