ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP : సంచలనం సృష్టించిన Guntur గ్యాంగ్‌ రేప్‌ కేసులో పురోగతి

ABN, First Publish Date - 2021-09-14T13:21:51+05:30

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గుంటూరు గ్యాంగ్‌ రేప్‌ కేసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు/అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గుంటూరు గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి జిల్లాలోని మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాలడుగు గ్రామశివారులో ఓ మహిళపై నలుగురు ఉన్మాదులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కొర్రపాడు వాసులే అని పోలీసులు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు.. సాంకేతికపరమైన అంశాల ఆధారంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


కాగా.. శుభకార్యానికి వెళ్ళివస్తున్న భార్యభర్తల్ని అటకాయించి ఆమె భర్తను కొట్టి, కట్టేసి అతని ముందే నలుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న కోల్డ్‌స్టోరేజీలో పని చేస్తున్న ఒడిశా, విజయనగరం ప్రాంతాలకు చెందిన కార్మికులను పోలీసులు తొలుత అనుమానించారు. వారిని అన్ని కోణాల్లో విచారించినా ఏ  ఆధారాలూ లభ్యం కాలేదు. అత్యాచారానికి ఒడిగట్టింది వారు కాదని ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అలా ఈ కేసు విషయం నాలుగైదు రోజులు జాప్యం జరిగింది. దీంతో మంగళవారం నాడు ఎట్టకేలకు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-09-14T13:21:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising