ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2021-12-02T06:01:03+05:30
ఓబీసీ జనగణన కోసం ఈనెల 13,14, 15న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపునిచ్చారు.
బీసీ జనగణన చేసే వరకు ఉద్యమం: కేసన శంకరరావు
గుంటూరు, డిసెంబరు 1: ఓబీసీ జనగణన కోసం ఈనెల 13,14, 15న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపునిచ్చారు. గుంటూరులో బుధవారం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జనగణనకు దేశవ్యాప్తంగా డిమాండ్ వచ్చినా కేంద్రం తాత్సారం చేయటం సరికాదన్నారు. బీసీ కులాల జనగణన సాధించేవరకు ఉద్యమం సాగిస్తామని స్పష్టం చేశారు. సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మాట్లాడుతూ జన గణనపై పార్లమెంటులో మాట్లాడని ఎంపీల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకునే పార్టీలకు బుద్ధిచెబుతామన్నారు. విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు తన్నీరు ఆంజనేయులు, గోనుగుంట్ల బ్రహ్మానందశర్మ, పావులూరి హనుమంతరావు, పరసా రంగనాఽథ్, కాశీ, రమేష్, వెంకటేశ్వర్లు తదితరులున్నారు.
Updated Date - 2021-12-02T06:01:03+05:30 IST