అలాంటి ప్రభుత్వాలు ఆఫ్ఘాన్, ఏపీలోనే ఉన్నాయ్: Bonaboina
ABN, First Publish Date - 2021-12-03T17:03:19+05:30
పేద, మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి రాష్ట్రంలో లేదని జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
గుంటూరు: పేద, మధ్య తరగతి ప్రజలు బ్రతికే పరిస్థితి రాష్ట్రంలో లేదని జనసేన పీఏసీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఓటీఎస్ కట్టకుంటే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను బెదిరించి పన్నులు వసూలు చేసే ప్రభుత్వాలు ఆఫ్ఘనిస్తాన్లోనూ, ఆంధ్రాలో మాత్రమే ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వ పాలన ఉందని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
Updated Date - 2021-12-03T17:03:19+05:30 IST