AP: గుంటూరులో అగ్నిప్రమాదం
ABN, First Publish Date - 2021-07-30T16:06:09+05:30
జిల్లాలోని వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం ఎస్టీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు: జిల్లాలోని వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం ఎస్టీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాలుగు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. వంట చేస్తుండగా పొయ్యి నుండి మంటలు చెలరేగి గుడిసెకు నిప్పు అంటుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Updated Date - 2021-07-30T16:06:09+05:30 IST