సాగర్ నుంచి పులిచింతలకు పెరుగుతున్న వరద
ABN, First Publish Date - 2021-09-17T17:07:13+05:30
నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్ట్కు వరద పెరుగుతోంది.
గుంటూరు: నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్ట్కు వరద పెరుగుతోంది. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు ఇన్ ఫ్లో లక్షా 98వేల 653 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో లక్షా 60వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77టీఎంసీలకు గాను..పులిచింతలలో ప్రస్తుతం నీటి నిల్వ 32.08 టీఎంసీలుగా నమోదు అయ్యింది. విద్యుత్ ఉత్పత్తికి 13వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.
Updated Date - 2021-09-17T17:07:13+05:30 IST