గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
ABN, First Publish Date - 2021-04-22T15:04:52+05:30
జిల్లాలో 2020-21 సంవత్సరానికి..
గుంటూరు: జిల్లాలో 2020-21 సంవత్సరానికి గాను రబీ సీజన్కు సంబంధించి మొత్తం 69 ఽధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పౌరసరఫరాల శాఖ డీఎం పి.జయంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన 559 రైతుభరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నమోదు చేసిన తేమశాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లిస్తామని స్పష్టం చేశారు.
Updated Date - 2021-04-22T15:04:52+05:30 IST