Guntur: రవీంద్ర ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
ABN, First Publish Date - 2021-10-24T17:34:03+05:30
నగరంలో టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
గుంటూరు: నగరంలో టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. లాడ్జి సెంటర్ నుంచి శంకర్ విలాస్ సెంటర్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడులు చేసిన వైసీపీ గుండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీ చిత్ర పటాన్ని తెలుగు మహిళలు చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు.
Updated Date - 2021-10-24T17:34:03+05:30 IST