Guntur: మేడికొండూరులో నకిలీ నోట్ల తయారీ కలకలం
ABN, First Publish Date - 2021-12-25T14:21:26+05:30
జిల్లాలోని మేడికొండూరులో నకిలీ నోట్ల తయారీ కలకలం రేపుతోంది.
గుంటూరు: జిల్లాలోని మేడికొండూరులో నకిలీ నోట్ల తయారీ కలకలం రేపుతోంది. మేడికొండూరులో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోటు తీసుకున్న షాపు ఓనర్ ఫిర్యాదుతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆరుగురు ముఠాగా ఏర్పడి నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కలర్ జిరాక్స్ సాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో మిగిలిన నలుగురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Updated Date - 2021-12-25T14:21:26+05:30 IST