Guntur: దుగ్గిరాలలో ఓ మహిళ ఇంట్లో చోరీ
ABN, First Publish Date - 2021-12-02T13:16:03+05:30
జిల్లాలోని దుగ్గిరాలలో పొన్నం విద్య శ్రీ అనే మహిళ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు.
గుంటూరు: జిల్లాలోని దుగ్గిరాలలో పొన్నం విద్య శ్రీ అనే మహిళ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. దాదాపు మూడు లక్షల నగదు, కిలో వెండిని దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమార్తె అమెరికా వెళ్తుండగా ఎయిర్ పోర్ట్కు వెళ్లిన సమయంలో చోరీ జరిగింది.
Updated Date - 2021-12-02T13:16:03+05:30 IST