guntur: ఉద్యానశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి రైతు సంఘాల యత్నం
ABN, First Publish Date - 2021-11-08T18:24:29+05:30
ఉద్యానశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి రైతు సంఘాలు యత్నించాయి. సూక్ష్మ సేద్యం రాయితీలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వటం లేదని నిరసనకు దిగారు.
గుంటూరు: ఉద్యానశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి రైతు సంఘాలు యత్నించాయి. సూక్ష్మ సేద్యం రాయితీలు వైసీపీ ప్రభుత్వం ఇవ్వటం లేదని నిరసనకు దిగారు. కమిషనర్ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు రైతు సంఘాలు యత్నించగా..పోలీసులు అడ్డుకున్నారు. వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో రైతు సంఘాలతో సూక్ష్మ సేద్యం ప్రాజెక్టు మేనేజర్ హరినాథ్ రెడ్డి చర్చించారు. రైతు సంఘాల నుంచి వినతి పత్రం స్వీకరించారు.
Updated Date - 2021-11-08T18:24:29+05:30 IST