ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచార బాధితురాలికి చెల్లని చెక్కుతో ప్రభుత్వం మోసం

ABN, First Publish Date - 2021-07-01T00:32:03+05:30

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీతానగరం అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిందని  భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బొల్లినేని నిర్మలా కిషోర్ ఆరోపించారు. అత్యాచారం కేసులో నిందితులను ఇంత వరకు అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఈ సంఘటన జరగడం శోచనీయమని ఆమె అన్నారు.


 రాష్ట్రానికి మహిళా హెూం మంత్రి ఉన్నా మహిళలపై అత్యాచార ఘటనలు పెరుగుతూ ఉండటం పోలీసుల అసమర్థతకు నిదర్శనమన్నారు. నిన్న తాడేపల్లిలో ప్రేమించలేదని ఒక అమాయకురాలిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో 455 అత్యాచార ఘటనలు జరిగినా వాటిని అరికట్టేందుకు ప్రయత్నించడం లేదని  నిర్మలా ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు పరిష్కరించారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితురాలికి చెల్లని చెక్కునిచ్చి ప్రభుత్వం కూడా మోసం చేసిందని నిర్మలా కిషోర్  ఆరోపించారు. 

Updated Date - 2021-07-01T00:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising