ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగులో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-09-04T05:13:49+05:30

మండలంలోని శ్రీరాంపురంతండా- బోదలవీడు మధ్యలో ఉన్న ఉప్పలవాగులో పడి రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

శ్రీనునాయక్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, సెప్టెంబరు 3: మండలంలోని శ్రీరాంపురంతండా- బోదలవీడు మధ్యలో ఉన్న ఉప్పలవాగులో పడి రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాంపురంతండాకు చెందిన రమావత శ్రీనునాయక్‌(40) పొలానికి ఎరువులు తెచ్చేందుకు బోదలవీడు బయలుదేరాడు. మార్గమధ్యంలోని ఉప్పలవాగులో కాలినడకన దాటుతూ ప్రమాదవశాత్తూ వాగు ఉధృతికి కొట్టుకుపోయాడు. పోలీసులు చేరుకుని గాలించగా చెట్లకొమ్మలకు మృతదేహం చిక్కుకుని లభ్యమైంది. దానిని వెలికితీసి  పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీనునాయక్‌కు భార్య కాంతిబాయి, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 

Updated Date - 2021-09-04T05:13:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising