ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటి చుట్టూ ఫెన్సింగ్‌...

ABN, First Publish Date - 2021-05-15T05:59:38+05:30

పంచాయతీ పోరంబోకు స్థలంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటిచుట్టూ వైసీపీ నాయకులు ఫెన్సింగ్‌ వేసిన సంఘటన అమరావతిలో జరిగింది.

ఇంట్లోకి వెళ్లకుండా స్థలం చుట్టూ వేసిన ఐరన్‌ ఫెన్సింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నాయకుల నిర్వాకం

అమరావ తి, మే 14: పంచాయతీ పోరంబోకు స్థలంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటిచుట్టూ వైసీపీ నాయకులు ఫెన్సింగ్‌ వేసిన సంఘటన అమరావతిలో జరిగింది. ఈ విషయంపై బాధితుని కథనం ప్రకారం... పది సంవత్సరాలుగా పంచాయతీ పోరంబోకు భూమిలో చిలకా వెంకయ్య నివాసం ఉంటున్నాడు. చిలకా వెంకయ్య టీడీపీ సానుభూతిపరుడవటంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత సంవత్సరం మే నెలలో స్థానిక వైసీపీ నాయకులు నివాసాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో వెంకయ్య హైకోర్టును ఆశ్రయించడంతో మండల, గ్రామస్థాయి అధికారులకు నోటీసులు వచ్చాయి. అప్పుడు వైసీపీ నాయకులు తొలగింపు పక్రియను విరమించుకుని సంవత్సరం తరువాత మరలా శుక్రవారం నూతన సర్పంచ్‌గా ఎన్నికైన చిలకా ఆనందరావు తన అనుచరులతో సాయంత్రం 4గంటలకు ఎక్స్‌వేటర్‌ తీసుకువచ్చి ఇంట్లోకి వెళ్లే మార్గాన్ని తొలగించి ఇంటి చుట్టూ వెంకయ్య కుటుంబం బయటకు రాకుండా ఫెన్సింగ్‌ వేశారు. స్థలం విషయం కోర్టులో ఉన్నప్పటికీ సర్పంచ్‌ అతని అనుచరులు ఇంట్లోకి రాకపోకలు లేకుండా ఫెన్సింగ్‌ వేయించడంపై బాధితుని కుమారుడు బుల్లోడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి ఫెన్సింగ్‌ తొలగించాలని లేకుంటే దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-15T05:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising