ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధులను మోసం చేశారు

ABN, First Publish Date - 2021-09-04T05:14:33+05:30

తాము అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.మూడు వేల పింఛన ఇస్తానని చెప్పిన జగన తర్వాత మాటతప్పి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ 

అచ్చంపేట, సెప్టెంబరు3: తాము అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.మూడు వేల పింఛన ఇస్తానని చెప్పిన జగన తర్వాత మాటతప్పి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఓ ప్రకటన చేశారు.  వృద్ధుల పింఛనలలో మిగులు పద్ధతిని అనుసరించటం సరైన విధానం కాదన్నారు.  పింఛన్ల భారం తగ్గించుకోవటానికి ప్రతినెలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారని విమర్శించారు. అనేకమంది కూలీలు వ్యవసాయ, కూలీ పనుల కోసం వలస వెళ్లి పట్టణాల్లో పిల్లల వద్ద ఉన్నారని, వీరి పింఛనలు తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.35తో పింఛనలు ప్రవేశ పెట్టారని, చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ పోతూ రూ.2వేలకు ఫింఛనలు తెచ్చారని, ఇది తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. జగనమోహనరెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చి పింఛన్ల నగదును పెంచాలని డిమాండ్‌ చేశారు. 

 

Updated Date - 2021-09-04T05:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising