ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-05-14T05:41:33+05:30

కరోనా బారిన పడి చనిపోయిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు.

కరోనాతో మృతుల రెవెన్యూ ఉద్యోగుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న డీఆర్‌వో కొండయ్య, ఏపీఆర్‌ఎస్‌ఏ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): కరోనా బారిన పడి చనిపోయిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు. ఇటీవల కరోనాతో మృతి చెందినన గురజాల ఆర్డీవో కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ కొల్లా శ్రీనివాస్‌, విశ్రాంత తహసీల్దారు అద్దేపల్లి భాస్కరరావు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాచవరం ఆర్‌ఐ షేక్‌ బాజీ నివాసాలకు వెళ్లి వారి కుటుంబసభ్యులను గురువారం డీఆర్వో పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. వారికి రావాల్సిన బెనిఫిట్స్‌ అన్నీ విడుదల చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా నాయకులు శ్రీనివాసశర్మ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-14T05:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising