విద్యుత్ షాక్తో మహిళ మృతి
ABN, First Publish Date - 2021-04-18T05:36:17+05:30
నూజెండ్లలో శనివారం విద్యుత్ షాక్తో గ్రామానికి చెందిన పల్లపు సుబ్బులు(55) అనే మహిళ మృతి చెందింది.
నూజెండ్ల, ఏప్రిల్ 17: నూజెండ్లలో శనివారం విద్యుత్ షాక్తో గ్రామానికి చెందిన పల్లపు సుబ్బులు(55) అనే మహిళ మృతి చెందింది. ఆరు బయట నిద్రించేందుకు ప్రహరీ గేటుకు ఉన్న ఇనుప గేటు నుంచి విద్యుత్ బోర్డుకు ప్లెగ్ పెట్టి టేబుల్ ఫ్యాన్ రోజూ వినియోగిస్తుండేది. ఉదయాన్నే 5:30 గంటల సమయంలో నిద్ర లేచిన ఆమె గేటు తీసే క్రమంలో ఇనుప గేటు మధ్య టేబుల్ ఫ్యాన్ వైరు నలిగి షాక్కు గురైంది. ఆమెను రక్షించేందుకు కుమారుడు వీరాంజనేయులు ప్రయత్నించగా అతడు కూడా స్వల్పంగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్రధాన లైన్కు విద్యుత్ సరఫరా నిలిపి వేసి సుబ్బులును వినుకొండ తరలించగా మార్గమధ్యలోను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
Updated Date - 2021-04-18T05:36:17+05:30 IST