ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
ABN, First Publish Date - 2021-01-16T05:23:49+05:30
దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని చల్లగుండ్లలో చోటుచేసుకుంది.
నకరికల్లు, జనవరి 15: దమ్ము ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని చల్లగుండ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కఽథనం ప్రకారం.. చల్లగుండ్ల గ్రామానికి చెందిన గాదె శ్రీనివాసరావు(48) ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. గురువారం చల్లగుండ్లలోని పొలాన్ని దమ్ము చేసేందుకు దమ్ము ట్రాక్టర్తో వెళ్లాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడటంతో శ్రీనివాసరావు మృతి చెందాడు. నకరికల్లు ఎస్ఐ పి.ఉదయబాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-01-16T05:23:49+05:30 IST