ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడవలపై ఇసుక తరలింపునకు అనుమతించాలి

ABN, First Publish Date - 2021-12-04T05:47:50+05:30

పడవలపై ఇసుక ఒడ్డుకు చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరారవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముప్పాళ్ల నాగేశ్వరరావు

గుంటూరు(తూర్పు), డిసెంబరు3: పడవలపై ఇసుక ఒడ్డుకు చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో శుక్రవారం అమరావతి ఇసుక పడవల యజమానుల సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాలో పడవలపై ఇసుకను ఒడ్డుకు చేర్చుకుని దాదాపు 1000మంది జీవనాపాధి పొందుతున్నారని పేర్కోన్నారు. అనుమతులు నిలిపివేయడంతో జీవనాఽధారం కోల్పోయి కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉపాధిని దృష్టిలోపెట్టుకుని పడవల ద్వారా ఇసుక ఎగుమతి, దిగుమతులను చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో వి.రాధాకృష్ణమూర్తి, జంగాల అజయ్‌కుమార్‌, వెంకటరెడ్డి, కె.నాగేశ్వరావు, సదాశివరావు, మల్లికార్జునరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-12-04T05:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising