తాడేపల్లిలో దంపతుల ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-07-29T21:57:34+05:30
జిల్లాలోని తాడేపల్లిలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. అయితే దంపతులు వారం రోజుల క్రితమే చనిపోయి
గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. అయితే దంపతులు వారం రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి తాళం వేసుకుని భార్యభర్తలు చనిపోయారు. ఇంటి నుంచి దుర్గదం రావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులు కొంతకాలంగా తాడేపల్లిలో ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పోలీసులకు దొరకలేదు. ఆధార్కార్డు, ఇతర కార్డులు కూడా వారు నివసిస్తున్న ఇంట్లో దొరకలేదు. వీరిద్దరూ వాడుతున్న సెల్ఫోన్లలోని సిమ్ కార్డులు తీసేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసుల విచారణకు కొంత ఆటంకం ఏర్పడుతోంది.
Updated Date - 2021-07-29T21:57:34+05:30 IST