క్లీన్ ఏపీలో అందరూ పాల్గొనాలి
ABN, First Publish Date - 2021-06-20T05:52:51+05:30
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ ఏపీ కార్యక్రమంలో ప్రజలంగా భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటకృష్ణయ్య పిలుపునిచ్చారు.
డిప్యూటీ కమిషనర్ వెంకటకృష్ణయ్య
గుంటూరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్లీన్ ఏపీ కార్యక్రమంలో ప్రజలంగా భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటకృష్ణయ్య పిలుపునిచ్చారు. నందివెలుగు రోడ్డులోని మెప్మా ఉపకార్యాలయంలో శనివారం పీడీ సావిత్రి అధ్యక్షతన జరిగిన క్లీన్ ఏపీ శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇంట్లో వచ్చే తడి, పొడిచెత్తద్వారా సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు. ప్రధానంగా పొదుపు మహిళలు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో సిటీ మిషన్ మేనేజర్ ఆరీఫాసుల్తానా, కమ్యునిటీ ఆర్గనైజర్లు ఎండీ ఆరిఫ్ఆలి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-20T05:52:51+05:30 IST