ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-04-21T13:38:19+05:30

కరోనా కట్టడిలో తమ ప్రాణాలకు..

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, డాక్టర్‌ మంజుల తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆదేశాలు


గుంటూరు: కరోనా కట్టడిలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారినపడ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ఆదేశిం చారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల పోలీసు అధికారు లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ అర్బన్‌లో ఇప్పటి వరకు 37 మంది కరోనా బారినపడ్డారన్నారు. చికిత్స పొందుతున్న పోలీసులపై ప్రత్యేక దృష్టిసారించి ఎప్పటికప్పుడు వారికి అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితి తెలు సుకుంటున్నామన్నారు. కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నామని తెలి పారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ 98 శాతం తీసుకున్నారని, రెండో డోసు కూడా త్వరి తగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కరోనా బారినపడిన వారిని పర్యవేక్షిం చేందుకు ప్రత్యేకంగా అధికారులను కేటాయించామన్నారు. 24 గంటలు పని చేసే విధంగా ఫ్యామిలీ హెల్త్‌ డెస్కు ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సహాయం కావాల్సిన వారు 86888 31573 నెంబరుకు ఫోను చేసి సహాయం పొందవచ్చన్నారు. సమావేశంలో డాక్టర్‌ మంజుల, అదనపు ఎస్పీ గంగాధరం, మనోహరరావు, డీఎస్పీలు బాలసుందరరావు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T13:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising