ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారం శాశ్వతం కాదు

ABN, First Publish Date - 2021-10-21T05:08:21+05:30

టీడీపీ కార్యాలయంపై వైసీసీ శ్రేణుల దాడి హేయమని, అధికారం శాశ్వతం కాదని సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి అన్నారు.

మాట్లాడుతున్న కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి

చిలకలూరిపేట టౌన్‌, గుంటూరు, అక్టోబరు 20: టీడీపీ కార్యాలయంపై వైసీసీ శ్రేణుల దాడి హేయమని, అధికారం శాశ్వతం కాదని సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలుసుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి అన్నారు. చిలకలూరిపేట కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో, గుంటూరులోని రాజీవ్‌గాంధీ భవనలో బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం, భౌతిక దాడులకు దిగటం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ దాడులు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ రక్షణకు విఘాతం కలుగుతుందన్నారు. ఇటువంటి దాడులు సిగ్గుచేటన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు తియ్యగూర యలమందారెడ్డి, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌ఛార్జి చుక్కా చంద్రపాల్‌, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎం.రాధాకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్‌ లీగల్‌సెల్‌ కన్వీనర్‌ ఎం.ప్రసన్న, మూడు మండలాల, పట్టణ కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరులోని విలేకరుల సమావేశంలో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, అడవి ఆంజనేయులు, ఎండీ ఉస్మాన్‌ తదితరులున్నారు.


Updated Date - 2021-10-21T05:08:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising