ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-07-28T05:45:04+05:30

సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు వలంటీర్ల ద్వారా అవగాహన కలిగించాలని కమిషనర్‌ చల్లా అనురాధ అన్నారు.

మొక్కలు నాటుతున్న కమిషనర్‌ అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), జూలై 27: సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు వలంటీర్ల ద్వారా అవగాహన కలిగించాలని కమిషనర్‌ చల్లా అనురాధ అన్నారు. శ్యామలానగర్‌లోని 99, 100, 101 వార్డు సచివాలయాలను కమిషనర్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజల నుంచి అందే ఫిర్యాదులు నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, లేనిచో సంబంధిత కార్యదర్శిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.   శ్యామలానగర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి ఏర్పాటుకు ప్లాన్‌ తయారు చేయాలని కమిషనర్‌  అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్యామలానగర్‌ ఆర్‌యూబీని అధికారులతో కలిసి పరిశీలించారు. స్థల సేకరణ, ట్రాఫిక్‌, నిధుల అంచనా, నిర్మాణ కాలం తదితర అంశాలతో కూడిన రివైజ్డ్‌ అంచనాలు తయారు చేయాలన్నారు.  పండరీపురం, దేవాపురం, కోబాల్ట్‌పేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులు తనిఖీ చేసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేబుల్‌ లైన్ల కోసం ఇస్టానుసారం గోతులు తవ్వడం, రోడ్లు పగలకొట్టడం చేసే కంపెనీలపై పోలీస్‌ కేసులు నమోదు చేసి వారి ఎన్‌ఓసీలను కూడా రద్దు చేయాలని ఆదేశించారు. చంద్రమౌళినగర్‌లోని స్వామీజీ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కమిషనర్‌ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-28T05:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising