BJP యువమోర్చా నేతలకు సామాన్యుడి షాక్
ABN, First Publish Date - 2021-11-25T18:28:37+05:30
బీజేపీ యువమోర్చా నేతలకు ఓ సామాన్యుడు షాక్ ఇచ్చాడు. నగరంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు.
గుంటూరు: బీజేపీ యువమోర్చా నేతలకు ఓ సామాన్యుడు షాక్ ఇచ్చాడు. నగరంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో భిక్షాటన నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఓ సామాన్యుడు బీజేపీ మోర్చా నేతలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జెండాలు మెడలో వేసుకొని వరద బాధితుల కోసం విరాళాలు సేకరించటమేమిటని ప్రశ్నించాడు. రాష్ట్రం వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని కేంద్రం సహాయం చెయ్యచ్చు కదా అని నిలదీశాడు. సామాన్యుడి ప్రశ్నకు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ విస్తుపోయాడు.
Updated Date - 2021-11-25T18:28:37+05:30 IST