ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ సభకో నమస్కారం..

ABN, First Publish Date - 2021-10-20T05:39:16+05:30

తాడికొండలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆసరా సభ జరుగుతుండగానే నుంచి డ్వాక్రా మహిళలు అక్కడినుంచి వెళ్లిపోయారు.

మహిళలు సభ మధ్యలో వెళ్లిపోవటంతో ఖాళీఅయిన కుర్చీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసరా సభ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన మహిళలు

యానిమేటర్లు అడ్డుకున్నా.. వినని వైనం

తాడికొండ, తుళ్లూరు, అక్టోబరు 19: తాడికొండలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆసరా సభ జరుగుతుండగానే నుంచి డ్వాక్రా మహిళలు అక్కడినుంచి వెళ్లిపోయారు. యానిమేటర్లు, వైసీపీ నాయకులు ఎంతచెప్పినా వినలేదు. దీంతో సభాప్రాంగణలోని కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి.  

వైఎస్సార్‌ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కులను పంపిణీ చేయటానికి ఎమ్మెల్యే శ్రీదేవి ఆధ్వర్యంలో తాడికొండ బీఎస్‌ఎస్‌బీ కళాశాలలో మంగళవారం పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు తాడికొండ, తుళ్లూరు మండలాల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. ఈ మీటింగ్‌కి రాకపోతే ఆసరా డబ్బు రాదంటూ బెదిరించి మరీ తీసువెళ్లినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. అక్కడ టెంట్లు కూడా వేయకపోవడంతో వచ్చినవారు ఎండకు ఇబ్బందిపడ్డారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటకే మహిళలు ఇళ్లకు వెళ్లిపోవటానికి సిద్ధపడ్డారు. వారిని వెళ్లనీయకుండా వైసీపీ నేతలు, డ్వాక్రా సీసీలు, యానిమేటర్లు అడ్డుకున్నారు. మైక్‌లో పదేపదే కోరారు. కళాశాల గేటును మూసివేశారు. దీంతో మహిళలు వారితో వాగ్వాదానికి దిగారు. ఎంత వారించి గేటును తోసుకుంటూ బయటకు వెళ్లిపోయారు.  


Updated Date - 2021-10-20T05:39:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising