ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం

ABN, First Publish Date - 2021-10-22T05:16:48+05:30

ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఏపీసీటీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న కిషోర్‌, నూతన కార్యవర్గ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీసీటీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

గుంటూరు, అక్టోబరు 21: ఉద్యోగులు  సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని ఏపీసీటీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఇటీవల సీటీశాఖ నరసరావుపేట డివిజన్‌కు సంబంధించి ఇటీవల జరిగిన గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్‌ కిషోర్‌కుమార్‌ ప్యానల్‌ ప్రమాణస్వీకారం అరండల్‌పేటలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ  ఇప్పటికీ ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై త్వరలో ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించే చర్యలు తీసుకుంటామన్నారు. నరసరావుపేట డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ నాగజ్యోతి మాట్లాడుతూ విధి నిర్వహణలో అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో మెలగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆస్కార్‌రావు, రామలింగం, మురళీకృష్ణ, సత్యనారాయణ, రమేష్‌కుమార్‌, చాంద్‌బాషా, నరసింగరావు, మెహర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T05:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising