AP నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీంలో ఊరట
ABN, First Publish Date - 2021-12-15T19:11:26+05:30
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 3 వారాల్లోపు పెండింగ్ జీతాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు 12 మంది ఉద్యోగులు రిలీవ్ అయ్యారు. సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ జీతాలపై ఉద్యోగులు సుప్రీంను ఆశ్రయించారు. రిలీవ్ అయిన ఉద్యోగుల తరపున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం సర్వీసు బ్రేక్ లేకుండా క్రమబద్ధీకరించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో ఉద్యోగికి రూ.10 వేలు చొప్పున చెల్లించాలని పేర్కొంది. కోర్టుకు రాని మిగిలిన ఉద్యోగులకు కూడా పోస్టింగ్ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
Updated Date - 2021-12-15T19:11:26+05:30 IST