కొవిడ్ బాధిత యువకుడి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-05-09T05:39:33+05:30
తనకు కొవిడ్ సోకడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది.
అమృతలూరు, మే 8: తనకు కొవిడ్ సోకడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేమూరు మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన చందు సురేష్(34) గత నెల 30న కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. మే 2న పాజిటివ్గా రిపోర్టు వచ్చింది. ఆ తర్వాతి రోజు నుంచి తెనాలి సమీపంలోని జగ్గడిగుంటపాలెం క్వారంటైన్ సెంటర్లో ఉంది చికిత్స పొందుతున్నాడు. కాగా మండలంలోని కూచిపూడి గ్రామం పరిధిలోని పొలంలో అతను పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ సుభాని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-05-09T05:39:33+05:30 IST