ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచ్‌ భర్తపై వైసీపీ నేతల దాడి

ABN, First Publish Date - 2021-06-15T05:43:19+05:30

మండలంలోని ఉంగుటూరు గ్రామ సర్పంచ్‌గా తెలుగుదేశం మద్దతుతో గెలుపొందిన మేదరమెట్ల అనురాధ భర్త సోమశేఖర్‌పై సోమవారం వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు.

వైసీపీ నాయకుల దాడిలో గాయపడ్డ సర్పంచ్‌ భర్త సోమశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 14: మండలంలోని ఉంగుటూరు గ్రామ సర్పంచ్‌గా తెలుగుదేశం మద్దతుతో గెలుపొందిన మేదరమెట్ల అనురాధ భర్త సోమశేఖర్‌పై సోమవారం వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. సోమశేఖర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తాను గ్రామంలోని చెరువు చుట్టూ ఉన్న ముళ్లకంపను ఎక్స్‌వేటర్‌తో తొలగిస్తుండగా వైసీపీ నాయకులు రాయపాటి సాంబశివరావు, ధర్మతేజ పనులకు అడ్డుతగిలి దాడి చేశారని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో శివ భార్య ఓటమి చెందడంతో తమపై కక్ష పెంచుకున్నాడని పేర్కొన్నారు. ఆ సమయంలో అడ్డుకున్న నల్లూరి శ్రీహరి అనే వ్యక్తిపై దాడి చేసి అతని కారు అద్దాలు పగుల గొట్టారని తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజేష్‌కుమార్‌, ఎస్‌ఐ కోటేశ్వరరావు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై కఠినచర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. గ్రామంలోకి పోలీసు అధికారులు వచ్చిన తరువాత కూడా వైసీపీ వర్గీయులు తెలుగుదేశం వర్గీయుల ఇళ్లపైకి దాడికి వెళ్లగా పోలీసులు వారిని అక్కడనుండి తరిమి వేశారు. 

Updated Date - 2021-06-15T05:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising