ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే

ABN, First Publish Date - 2021-12-15T05:42:44+05:30

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

సమావేశంలో పాల్గొన్న అఖిలపక్షాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరుపతి సభ జరిగి తీరుతుంది

నేడు జిల్లావ్యాప్తంగా మద్దతు ర్యాలీలు

అఖిలపక్ష సమావేశంలో నాయకులు

గుంటూరు(తూర్పు), డిసెంబరు14: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు సంఘీభావంగా రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే అమరావతి విషయంలో జగన్‌ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి నడిబొడ్డున సకల సౌకర్యాలు కలిగిన అమరావతే రాష్ట్రరాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ  పాదయాత్రకు సంఘీభావంగా నగరంలో బుధవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్‌ రెడ్‌స్టార్‌ నాయకులు హరిప్రసాదు, ఎంసీపీఐయూ నాయకులు కె.శ్రీధర్‌, టీడీపీ నాయకుడు దాసరిరాజా మాస్టారు, తాడికొండ నరసింహారావు తదతరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-15T05:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising