ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-04-23T05:37:57+05:30

మండలంలోని పోట్లూరు సమీపంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి గ్రామానికి చెందిన బొల్లా సంజీవరావు(42) మృతి చెందాడు.

బొల్లా సంజీవరావు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేల్పూరు(శావల్యాపురం), ఏప్రిల్‌ 22: మండలంలోని పోట్లూరు సమీపంలో రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద బుధవారం రాత్రి గ్రామానికి చెందిన బొల్లా సంజీవరావు(42)  మృతి చెందాడు. సంజీవరావు వ్యక్తిగత పనులపై వినుకొండకు వెళ్ళి తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో  రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద గుంతలు ఉండడంతో బైకు అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయింది. దీంతో రోడ్డుపై పడిన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది నరరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఇతడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. సంజీవరావు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అన్నయ్య కుమారుడు. సంజీవరావు అంత్యక్రియలను వేల్పూరు గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరావు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Updated Date - 2021-04-23T05:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising