ఏపీలో మహిళలపై రోజుకో ఘోరం.. బాధితురాలిపై పోలీసులే వేధింపులు!
ABN, First Publish Date - 2021-09-12T00:57:12+05:30
ఏపీలో మహిళలపై రోజుకో ఘోరం.. బాధితురాలిపై పోలీసులే వేధింపులు!
గుంటూరు: ఏపీలో మహిళపై రోజుకో ఘోరం జరుగుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఆపదలో పీఎస్కు వచ్చిన బాధితురాలిపై ఏకంగా పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారు. ఫిర్యాదు చేసిన మహిళా డాక్టర్ను ఖాకీలే దారుణంగా కొట్టిన ఘటన మంగళగిరిలో జరిగింది. మంగళగిరి మండలం నూతక్కికి చెందిన మహిళా డాక్టర్ తన భర్తతో సమస్యలున్నాయని పోలీసులను ఆశ్రయించారు. దిశ యాప్లో కూడా ఫిర్యాదు చేసింది. సమస్యను తెలుసుకుని న్యాయం చేయాల్సిన మంగళగిరి రూరల్ ఎస్సై ఏడుకొండలు దుర్భాషలాడారని, మఫ్టీలో పోలీసులతో వచ్చి అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మహిళల రక్షణకోసం వచ్చిన దిశ యాప్లో ఫిర్యాదు చేసినా ఫలితంలేదని వాపోయారు.
Updated Date - 2021-09-12T00:57:12+05:30 IST