ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లేఖ’తో కదిలారు!

ABN, First Publish Date - 2021-06-21T08:58:45+05:30

ముఖ్యమంత్రికి లేఖ రాస్తే కానీ అధికారులు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఏకంగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడం.. పత్రికల్లో ఈ వార్త ప్రచురితం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లి డెత్‌ సర్టిఫికెట్‌ మంజూరు.. 

నోషిత సమస్య పరిష్కరం

అల్లూరు, జూన్‌ 20: ముఖ్యమంత్రికి లేఖ రాస్తే కానీ అధికారులు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఏకంగా సీఎం జగన్‌కు ఫిర్యాదు చేయడం.. పత్రికల్లో ఈ వార్త ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై స్పం దించింది. తన తల్లి మరణ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసినా అధికారులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. విసిగిపోయి మానసికంగా కుంగిపోయానని.. చిన్నప్పుడే తండ్రికి దూరమైన తాను అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నానంటూ.. సీఎం జగన్‌కు నెల్లూరు జిల్లా అల్లూరు నివాసి బిరదవోలు నోషిత(15) లేఖ రాసి రిజిస్టర్‌ పోస్టులో పంపిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆదివారం పత్రికల్లో ఈ వార్త ప్రచురితం కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గంటల వ్యవధిలోనే స్పందించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు డెత్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేసి, 10 గంటలకు నోషిత నివాసానికి వెళ్లి అల్లూరు పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్‌ అందజేశారు.

Updated Date - 2021-06-21T08:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising